
మంత్రి మల్లారెడ్డి తన ఫోన్ ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు?: రఘునందన్ రావు
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. దుబ్బాక నియోజకవర్గ అభిృద్ధికి కేటాయించిన రూ.5 కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు కల్పించాలంటూ ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడుల అంశంపై స్పందించారు. నోటీసులు ఇవ్వగానే మల్లారెడ్డి కుమారుడికి గుండె నొప్పి వస్తుందా? అని ప్రశ్నించారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారని తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.

