
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలో శాంతిఖని గనికి చెందిన సింగరేణి కార్మికుడు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బైపాస్ రోడ్డు కుంట రాములు బస్తీ ఏరియాలో రోడ్డు ప్రక్కన పోగుల సంతోష్ సింగరేణి కార్మికుడు మృతి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


