
మంచిర్యాల జిల్లా: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ మహోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ లో ఫ్రీడం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి..
ఈ సందర్భంగా ఖోఖో, కబడ్డీ, టాగ్ ఆఫ్ వార్, లాంగ్ జంప్, వాలీబాల్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, సిఐ నారాయణ నాయక్, ఎస్సై తైసోద్దీన్, అంజయ్య, మరియు పోలిస్ సిబ్బంది, తదితరాలు పాల్గొన్నారు..

