
మంచిర్యాల జిల్లా: తెరాస నాయకులు బరితెగించి భూములను ఆక్రమించుకుంటున్నారని, అందుకు స్థానిక నాయకులు వత్తాసు పలుకుతున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బెల్లంపల్లిలో నిర్వహించిన భాజపా నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. స్థానిక నాయకుల బెల్లంపల్లిలో ఆక్రమణలు పెరిగినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో భాజపాను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు..


