
మంచిర్యాల జిల్లా: సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల దివ్యాంగులైన పిల్లల సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మెడపట్ల సతీష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు ఎస్కే అక్బర్, మునిగంటి గోపాలకృష్ణ, తోట ప్రశాంత్ పాల్గొన్నారు..

