
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం జిల్లా: కొమురంభీం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి పాల్గొన్నారు. ఆదివారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మార్క గూడా (అర్లీ) గ్రామంలో కొమురంభీం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు అరిగెల నాగేశ్వర్ రావు, జెడ్పీటీసీ డాక్టర్ అజయ్ కుమార్, ఎంపీపీ విమలా బాయి, ఆసిఫాబాద్ సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ నిషార్, సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

