Telugu Updates
Logo
mobile after logo

కిషనన్నా వెల్ డన్.. మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో 3 ఎలివేటర్లను నిన్న కిషన్ రెడ్డి ప్రారంభించారు. దానిపై ట్విటర్ ద్వారా స్పందించిన కేటీఆర్… భాజపా ఎంపీ తన నియోజకవర్గానికి చేసిన గొప్ప పని ఎలివేటర్లను ప్రారంభించడమే అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చిన కిషనన్నా వెల్డన్ అని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస, భాజపా మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Post Midle
Post bottom
Post bottom