
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జాతీయ ఆరోగ్య సంస్థ పరిధిలో బస్తీ దవాఖానా క్రింద ఎం.ఎల్.హెచ్.పి.ఎన్ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక జాబితాపై ఏవేని అభ్యంతరాలు ఉన్నచో తెలియజేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జాబితా మంచిర్యాల అధికారిక వెబ్సైట్ www.mancherial.telangana.gov.in నందు పొందుపర్చడంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శనకు ఉంచడం జరిగిందని అభ్యర్థులకు ఇట్టి జాబితాపై ఏవేని అభ్యంతరాలు ఉన్నచో ఈ నెల 28, 29 తేదీలలో సాయంత్రం 5 గం॥ల లోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పని వేళలలో వ్రాతపూర్వకంగా తగిన ధృవపత్రాలు జత చేసి సమర్పించాలని, గడువు ముగిసిన తరువాత వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకోబడవని తెలిపారు.

