అక్రమ నిర్మాణం ఆరోపణలతో గోవాలోని మండ్రమ్ పంచాయతీ బుధవారం తెలుగు సినీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.
అక్రమ కట్టడం నేపథ్యంలో.

ఆంజనేయులు న్యూస్, గోవా: అక్రమ నిర్మాణం ఆరోపణలతో గోవాలోని మండ్రమ్ పంచాయతీ బుధవారం తెలుగు సినీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. అశ్వవాడ గ్రామ పరిధిలో సర్వే నం. 211/2బి లో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో గోవా పంచాయతీ రాజ్ చట్టం 1994 కింద సర్పంచి అమిత్ సవంత్ నోటీసులు జారీ చేశారు. పనులు నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.

