బదిలీల విషయంలో గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: బదిలీల విషయంలో గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని ఇటీవల టీచర్లు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేయాలని నిర్ణయించింది. సూర్యపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈనెల 27 నుంచి ప్రారంభంకానుంది.

