
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారాహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. రోడ్డు నంబర్ 12లో ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో కారును కడుగుతూ కనిపించారు. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించొద్దని హెచ్చరించారు. అంతేకాకుండా ఆయనకు నోటీసు ఇచ్చి జరిమానా విధించాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. దీంతో ఆ వ్యక్తికి రూ10వేల జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇతర అవసరాలకు వినియోగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..


