Tuesday, August 18, 2026
HomeTelanganaవింత వ్యాధులతో బాధపడుతున్న పశువులు

వింత వ్యాధులతో బాధపడుతున్న పశువులు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలంలో పశువులకు వింత వ్యాధి సోకింది. మండల కేంద్రంలో పశువులకు బొబ్బలు బొబ్బలుగా ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మండల కేంద్రంలో ప్రత్యేక పశు వైద్య క్యాంపు ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు. ఈ విషయమై బెజ్జూర్ ఇన్చార్జి పశు వైద్యాధికారి రాకేష్ ను సంప్రదించగా రైతులు పశువులకు బొబ్బలు జబ్బు వస్తున్నట్టు తమకు సమాచారం అందిస్తే వైద్యం చేస్తామని తెలిపారు. పశువులకు ఎలర్జీ వల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.