Telugu Updates
Logo
mobile after logo

ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై దాడి.!

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న ఎస్ఎఫ్ఎస్ఐ కార్యాలయంలపై దాడి చోటుచేసుకుంది. కేరళలోని వయనాడ్లో ఉన్న రాహుల్గాంధీ కార్యాలయంపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఎస్ఐ) కార్యకర్తలు ఈ రోజు దాడి చేశారు. కేరళలోని అటవీ ప్రాంతాల్లో ఏకో సెన్సెటివ్ జోన్ ఏర్పాటు విషయంలో స్పందించట్లేదని ఆరోపిస్తూ కార్యాలయంలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటనకు నిరసనగా హైదరాబాద్లో ఎన్ఎస్ఎ్యూఐ నాయకులు ఎస్ఎఫ్ఎస్ఐ కార్యాలయంపైకి దాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు..

Post bottom