Telugu Updates
Logo
mobile after logo

ఆక్రమించుకున్న భూములపై అధికారులతో విచారణ జరిపించాలి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జన్నారం మండల పరిధిలోని గ్రామాలలో మండల కేంద్రంలో ప్రతి ఒక్క చెరువు కుంటలు సికం ఎస్ సి లకు ఇచ్చిన భూములు కబ్జాకు గురైనాయి. వీటిపై ఉన్నత స్పెషల్ అధికారులను కమిటీగా నియమించి పూర్తీ స్థాయిలో అనగా రైతుల వద్దకు చెరువుల వద్దకు కుంటల వద్దకు రాజకీయ నాయకులు వెంట రాకుండా అధికారులే స్వయంగా వెళ్లి పరిశీలనగా విచారణ జరుపుతె వాస్తవాలు బయట పడుతాయని గవ్వల శ్రీకాంత్ అన్నారు. గతం నుండి కింది నుండి పై అధికారులకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించిన స్పందన లేదు సి ఎం వరకు సోషల్ మీడియా ద్వారా వినతి పత్రాలు స్పీడ్ పోస్టుల ద్వారా పంపిన రెవెన్యూ అధికారుల అవినీతి చిట్టా వారికి తగ్గ ప్రజ ప్రతినిధులు అవినీతి పరులు ఎప్పటికి అప్పుడు పై అధికారులకు మంత్రులకు వివరించిన కేవలం బదిలీ చేయడం అ అధికారుల వద్ద మామూళ్లు తీసుకొని వదిలి పెట్టడం బంధువుల పేర కులం పేర పై అధికారులు నాయకులు కాపాడటం రోజు జరుగుతూనే ఉంది ఇప్పటికైన జన్నారం మండల పరిధిలో దాదాపు అన్ని చెరువులు కబ్జా జరిగినవి కాబట్టి కిష్టాపూర్ చర్లపల్లి జన్నారం బాదాంపల్లి చింతలపల్లి కొత్తపేట కవ్వాల కామన్ పల్లి ఇందన్ పల్లి కలమడుగు మురిమడుగు మోర్రిగూడ మందపల్లి పోనకల్ చింతగూడ మహ్మదాబాద్ తిమ్మాపుర్ రాంపూర్ తపాల్ పూర్ సింగరాయి పెట్ దేవునిగూడ దేవుని చెరువు కడం కినల్ పరిధిలో ఉన్న భూములు ఎవరి ఆదినములో ‘ఉన్నాయి.
జన్నారం తహసీల్దారు కార్యాలయం ఎం పి డి ఓ కార్యా లయం వెనుకలో ఉన్న చెరువు కుంటల భూమి ఒడ్డేపల్లి చెరువు గుట్టలు బోర్లు ఏవిధంగా పట్టాలు అయినాయి మరియు ఈ చెరువుల తో పాటు ఇంక ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి అవి ఎన్ని వాటి పరిధిలో ఎంత భూమి ఉంది ఉంటే ఎవరి కబ్జా లో ఉంది. కబ్జాలో ఉంటే వారికి ఎలా చెందింది అంతక ముందు ఎవరి పేరు మీద చేసినారు చేస్తే ఎలా చేసినారు గత ముప్పై నుండి నలభై సంవత్సరాల వరకు పూర్తీ సామాగ్రా విచారణ జరిపించాలని వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టి జల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు గవ్వల శ్రీకాంత్ తో పాటు మండల జిల్లా నాయకులు పవర్ దినేష్ తిరుపతి నర్సయ్య లింగన్న కండ్లే దుబ్బయ్య రాజయ్య రాహుల్ సన్ని అరవింద్ వెంకటేష్ రాజు పాల్గొని డిమాండ్ చేశారు.

Post Midle
Post bottom
Post bottom