
నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, రెండు వాహనాలు స్వాధీనం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇంచార్జి పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో పిడియస్ రైస్ చుట్టప్రక్కల గ్రామాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసినిల్వ ఉంచిన అశోక్ లేయలాండ్ ట్రాలీ TS 04 UC 2890, మరియు ape ట్రాలీ B. No. TS 27 T3167 లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి మోటం రాజు s% గంగారాం, వయస్సు 32, విద్యా నగర్, మందమర్రి తన ఇంటి వద్ద తనిఖీ లు చేయగా నిల్వ ఉంచిన 90 బ్యాగ్స్ సుమారు 40 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, రెండు వాహనాలు స్వాధీన పరుచుకొని నిందితుడు రాజు ను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ కు అప్పగించామని తెలిపారు..


