Monday, August 17, 2026
HomeCrimeపేకాట ఆడుతూ పట్టుబడ్డ జైపూర్ ఎంపీడీవో

పేకాట ఆడుతూ పట్టుబడ్డ జైపూర్ ఎంపీడీవో

📰 Generate e-Paper Clip

ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు

అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని” డిమాండ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ జన్నారం మండలంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, సంబంధిత అధికారిపై మరోవైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు, ఇలాంటి అవినీతి అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై శాఖపరమైన విచారణ జరుగుతుందా? తప్పు నిరూపితమైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.