Monday, August 17, 2026
HomeTelanganaఅంజనీపుత్ర ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

అంజనీపుత్ర ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

📰 Generate e-Paper Clip

అంబరాన్ని అంటిన సంబరాలు. అందరూ చల్లగా ఉండాలి

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన

అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్యుత్ వెలుగులు టపాసుల మోతలు యువత కేరింతల నడుమ నూతన సంవత్సరం స్వాగత వేడుకలు ప్రారంభమయ్యాయి.. శనివారం జైపూర్ మండలం దుబ్బపల్లి లోని డైమండ్ సిటీ వేదికగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యావత్ అంజనీపుత్ర సంస్థ కుటుంబ సభ్యులు, అభిమానులు వేడుకలు అపూర్వ రీతిలో డాన్సులతో వేడుకలు నిర్వహించారు. కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. బాణసంచా వెలుగుల్లో శోభాయమానంగా మెరిసిపోయాయి. విద్యుతీప కాంతుల్లో దగదగలాడాయి. ఈ సందర్భంగా అంజనీపుత్ర సంస్థ ఛైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి మాట్లాడుతూ.. గత ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా గొప్పపేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అదృష్టమన్నారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిగా నిర్వహించు కోవడంలో ప్రతి ఒక్కరి భాగ స్వామ్యం మరువలేనిదని పేర్కొన్నారు. 2024 నూతన సంవత్సరం లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరారు. అనంతరం చైర్మెన్ గుర్రాల శ్రీధర్ కేకు కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.