
కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ లు.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం దళిత జర్నలిస్ట్ ఫోరమ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాసు రాకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాసు రాకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేసి శాలువా తో సత్కరించి, ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో పార్వతి రాజేష్, పార్వతి సురేష్, చొక్కరాపు శ్రీనివాస్, నేరెళ్ళ రమేష్, నలివెటి మహేష్, డేగ ఆంజనేయులు, ఓదెలు, కేదారి, శ్రీధర్, ప్రబంజన్, మరియు తదితరులు పాల్గొన్నారు.
