కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు ను అందుకుంటున్న అన్నం కల్పన
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కు చెందిన శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, నాట్య విభూషని, డా॥ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత అన్నం కల్పన (MA కూచిపుడి) కు ఉత్తమ కూచిపూడి కళాకారణి గా అవార్డు దక్కింది. రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, డిసీపీ అఖిల్ మహాజన్, చేతు మీదుగా అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అడిషనల్ కనెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు..
