Monday, August 17, 2026
HomeWorldఇలాంటివి భారత్ లోనే సాధ్యమంటోన్న ఆనంద్ మహీంద్రా

ఇలాంటివి భారత్ లోనే సాధ్యమంటోన్న ఆనంద్ మహీంద్రా

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. సరికొత్తగా అనిపించే ఫొటోలు, వీడియోలను ట్విటర్ లో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చిన్నచిన్న లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేసిన స్కూటర్ కు సంబంధించిన క్లిప్పింగ్ ను మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. టైర్లు మినహాయిస్తే.. ఆ స్కూటర్ మొత్తాన్ని అలంకరణ వస్తువులతో చూడముచ్చటగా తయారు చేశారు. హ్యాండిళ్ల మధ్య డూంలో ఓ సెల్ ఫోన్ ను సైతం అమర్చారు. ఓ పెట్రోల్ బంకు వద్ద పార్కు చేసి ఉన్న ఈ స్కూటర్ వద్ద పలువురు సెల్ఫీలు కూడా తీసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. కాగా ఆ వీడియోను మహీంద్రా షేర్ చేస్తూ.. ‘జీవితం రంగులమయంగా, వినోదాత్మకంగా ఉండాలని మీరు కోరుకుంటే అలాగే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ఐడియాలు భారత్ లొనే సాధ్యం అని అన్నారు. కాగా ఆ పోస్టును ఇప్పటికే 3. 3లక్షల మంది వీక్షించారు. 16వేల మంది లైక్ చేశారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.