Wednesday, August 19, 2026
HomeCrimeటైమర్ సెట్ చేసిన బాంబులు.. డ్రోన్ తో జారవిడిచి..

టైమర్ సెట్ చేసిన బాంబులు.. డ్రోన్ తో జారవిడిచి..

📰 Generate e-Paper Clip

జమ్మూ: వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్ ముష్కరులు చేస్తోన్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ను గుర్తించి కాల్పులు జరిపారు. డ్రోన్ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్నూర్ సెక్టార్ లొనీ భారత్ – పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో నిన్న రాత్రి ఓ డ్రోన్ సంచరిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసు పార్టీ అక్కడ మోహరించి యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి దించారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో కనక్ మరోసారి డ్రోన్ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే డ్రోన్ లో ఉన్న పేలోడ్ కిందపడగా.. డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్లు జమ్మూ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.