Wednesday, August 19, 2026
HomeTelanganaమున్సిపాలిటీలో పట్టణ ప్రగతి ప్రారంభం..!

మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి ప్రారంభం..!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని సాయికుంటలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, ఎమ్మెల్యే ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గా గాజుల ముకేష్ గౌడ్, కమీషనర్ బాలకృష్ణ, వార్డు కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.