Wednesday, August 19, 2026
HomeCrimeకేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ కన్నుమూత

📰 Generate e-Paper Clip

న్యూడిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ (94) కన్నుమూశారు. ఈ నెల 4న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..

హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభ స్థానం నుంచి సుఖ్ రామ్ 3 సార్లు ఎంపీగా. ఎన్నికయ్యారు. . 1993-1996 మధ్య కాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1963 నుంచి 1984 వరకు మండి ఎమ్మెల్యేగా 5 సార్లు గెలుపొందారు. రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిగా పని చేశారు. 1984లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పని చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.