Wednesday, August 19, 2026
HomeTelanganaమంత్రి కాన్వాయ్ కు ప్రమాదం.. గన్మేన్లకు గాయాలు..

మంత్రి కాన్వాయ్ కు ప్రమాదం.. గన్మేన్లకు గాయాలు..

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చోటుచేసుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో కార్గిల్ సెంటర్ సమీపంలోకి రాగానే కాన్వాయ్ కు జంతువు అడ్డు రావటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. ఆ వెనుకనే వస్తున్న కాన్వాయ్ లోని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గన్మెన్లకు స్వల్ప గాయాలు కాగా.. మంత్రి సత్యవతి సురక్షితంగా మహబూబాబాద్ కు చేరుకున్నారు. స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.