
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జోన్ కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట పూర్ గ్రామం చుట్టూ పక్కల నుండి పీడీఎస్ రైస్ సేకరించి కాగజనగర్ కి అక్రమంగా కొంతమంది అక్రమార్కులు ఆటో ల ద్వారా అక్రమంగా పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకుఎస్ ఐ సురేష్ సిబ్బంది తో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్జా పూర్ ఆటో స్టాండ్ వద్ద అక్రమముగా తరలిస్తున్న సుమారు 08 క్విటాళ్ళ పీడీఎస్ రైస్ ను ఆటో తో పాటు నిందితున్ని పట్టుకోవడం జరిగింది. నిందితుడు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు
పట్టుబడ్డ నిందితుని వివరములు..
చింతల రమేష్ S/o వెంకటయ్య, వయస్సు: 37 సంవత్సరాలు, కులం: బేడ బుడిగె జంగం, Occn: ఆటో డ్రైవర్, మంచిర్యాలకు చెందిన R/o NTR నగర్
ఆటో B/No AP01W-8870 పీడీఎస్ రైస్ 08 క్వింటాళ్లు వాటి విలువ 9000 వేలు

