
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: వినూత్న ఆలోచనలతో ప్రజా ఉపయోగకర ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ గడువు ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిష్కర్తలు తాము చేసిన ఆవిష్కరణలను నిబంధనల మేరకు ఈ నెల 10వ తేదీ లోగా 9100678543 నంబర్కు వాట్సాప్ చేయాలని, అందిన ఆవిష్కరణలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసిన ఈ నెల 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించడం జరిగిందని,
ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమాజంలో నెలకొన్న నమస్యలను నూతన, వినూత్న ఆలోచనతో పరిష్కార మార్గం చూపే విధంగా ఆవిష్కరణలు రూపొందించి ఆవిష్కర్తలు గుర్తింపు పొందాలని తెలిపారు.

