
తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం: ప్రధాని మోధీ
ఆంజనేయులు న్యూస్: భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం.
• తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది.
• తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు.
• తెలంగాణలో కమల వికాసం ఖాయం
• తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను
• మీరు ఒక యుద్ధం చేస్తున్నారు.. ఒక పోరాటం చేస్తున్నారు.
• తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు.
• తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది
• తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు
• తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు.
• ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది
• బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది.
• మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం.
• గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది.
• “కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు.
• 1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు.
• హైదరాబాద్ ఇన్ఫరేషన్ టెక్నాలజీకి కోట లాంటింది
• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది.
• తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం.
• కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు.
• ఆ బూతులను నేను పట్టించుకోను.
• బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
• నన్ను తిట్టినా పట్టించుకోను కానీ.. తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు.
• తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
• పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
• తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు.
• తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు.
• డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారు.
• తెలంగాణ కుటుంబ పాలన పోయి.. ప్రజల కోసం పనిచేసే బిజెపి ప్రభుత్వం రావాలి
• బీజేపీ యువకుల పార్టీ. పేదలకు అనుకూలంగా పాలన చేసే పార్టీ.
• తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత.

