Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 12 November 2022, 2:45 pm Posted by : Anjaneyulu Dega

బేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్.

తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం: ప్రధాని మోధీ

ఆంజనేయులు న్యూస్: భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం.

తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది.

తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు.

తెలంగాణలో కమల వికాసం ఖాయం

తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను

మీరు ఒక యుద్ధం చేస్తున్నారు.. ఒక పోరాటం చేస్తున్నారు.

తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు.

తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది

తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు

తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు.

ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది

బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది.

మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం.

గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది.

“కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు.

1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు.

హైదరాబాద్ ఇన్ఫరేషన్ టెక్నాలజీకి కోట లాంటింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది.

తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం.

కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు.

ఆ బూతులను నేను పట్టించుకోను.

బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నన్ను తిట్టినా పట్టించుకోను కానీ.. తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు.

తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు.

తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు.

డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారు.

తెలంగాణ కుటుంబ పాలన పోయి.. ప్రజల కోసం పనిచేసే బిజెపి ప్రభుత్వం రావాలి

బీజేపీ యువకుల పార్టీ. పేదలకు అనుకూలంగా పాలన చేసే పార్టీ.

తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత.