
మంచిర్యాల జిల్లా: జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు తావివ్వకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జైపూర్ ఏసిపి నరేందర్ ఉత్తర్వుల ప్రకారం చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ నరేష్, ఎస్ఐ వెంకట్ శనివారం ప్రాణహిత పరివాహక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేశారు. స్పెషల్ పార్టీ, టిఎస్ఎస్పి, స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఏరియా డామినేషన్, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత గ్రామల్లోని ఫెర్రీ పాయింట్స్ ను సందర్శించారు. ఆ మార్గంలో కల్వర్టులను చెక్ చేసి పడవలు నడిపే వారు, చేపలు పట్టే వారితో మాట్లాడి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పరిసర గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు..
