Tuesday, August 18, 2026
HomeTelanganaమావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్

📰 Generate e-Paper Clip

ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు

ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో  నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ముఖ్య అతిథిగా హజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వేమన్ పల్లి మండలం కల్లంపల్లి, రాజారాం, సంపుటం, దస్నాపూర్, గొర్లపల్లి, కొత్తకాలనీ, జిల్లెడ, జక్కేపల్లి, బుయ్యారం, రాచర్ల, ముల్కల్పేట్, ముక్కిడిగూడెం, సీతారా, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెనా, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మల్పేట గ్రామాల నుండి సుమారు  800 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ  సందర్భంగా సిపి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు, అవసరాల  కోసం, భద్రత కోసం ఒక అన్న లాగా కుటుంబ పెద్దలాగా పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో  ఉంటామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే కమీషనరేట్ పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రజా శ్రేయస్సును ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

ఆదివాసి గ్రామస్తులకు, మహిళలకు పోలీసులపై ఉన్న సదాభిప్రాయాన్ని, ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా గ్రామస్తుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్న ఆదివాసీలను అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని సిపి తెలిపారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరడమైనది. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల  ప్రధాన లక్ష్యం అని అన్నారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు.

ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీసు అధికారులకు పల్లె నిద్ర కార్యక్రమం లో భాగంగా మీ వద్దకు వచ్చిన అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించడం జరుగుతుంది అని గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం అక్కడ పాల్గొన్న ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం వృద్దులకు  దుప్పట్లను, యువతకు వాలీబాల్ కిట్లను సిపి పంపిణి చేశారు.

అనంతరం మెగా వైద్య శిబిరం లో కార్యక్రమంలో పాల్గొన్న  ప్రజలకు భోజన సౌకర్యాలు కల్పించారు. వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్ లను బృందానికి మరియు సీపీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.