Tuesday, August 18, 2026
HomeTelanganaమంచిర్యాలలో హైడ్రా కలకలం

మంచిర్యాలలో హైడ్రా కలకలం

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ లీడర్ కు చెందిన భవనం కూల్చివేత

అనుమతి ఒక చోట.. నిర్మాణం మరో చోట చేపట్టారంటున్న మున్సిపల్ అధికారులు

భారీగా పోలీసుల మోహరింపు.. డీకొండ అన్నయ్య ముందస్తు అరెస్ట్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలకూ హైడ్రాను విస్తరింపజేయాలని సామాన్యులతో పాటు అధికార పక్షనేతలు, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మాదిరిగానే మంచిర్యాలకు హైడ్రా చేరింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్ లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ ను పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ముందస్తు నోటీసులు ఇచ్చాం. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ భవన నిర్మాణానికి సర్వే నంబర్ 40 లో అనుమతులు సర్వే నంబర్ 42 లో చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ విషయమై 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించుకోలేదన్నారు. 15 రోజుల క్రితం సైతం నోటీసులు జరి చేశామని చెప్పారు. పోలీస్ అధికారుల సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.