Tuesday, August 18, 2026
HomeTelanganaఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతర పర్యవేక్షణ

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతర పర్యవేక్షణ

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని 002-చెన్నూర్ 003 బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలలో జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కొరకు ఎన్నికల సాధారణ, ఖర్చుల పరిశీలకులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. 003-బెల్లంపల్లి, 004-మంచిర్యాల నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా బిశ్వజిత్ దత్తా ఐ.ఎ.ఎస్., మొబైల్ నం.7780382020, 002-చెన్నూర్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా సజ్జన్ ఆర్ ఐ.ఎ.ఎస్., మొబైల్ నం. 8247623113, 002-చెన్నూర్, 003 బెల్లంపల్లి నియోజకవర్గ ఖర్చుల పరిశీలకులుగా అశోక్ కుమార్ సత్తార్ ఐ.ఆర్.ఎస్., మొబైల్ నం. 8317650920, 004-మంచిర్యాల నియోజకవర్గ ఖర్చుల పరిశీలకులుగా సి. ఎస్. పవన్ ఐ.ఆర్.ఎస్. మొబైల్ నం. 8317669392లను నియమించగా పరిశీలకులు జిల్లాలోని నస్పూర్లో గల సింగరేణి అతిథి గృహంలో ఉంటారని, జిల్లా పోలీసు పరిశీలకులుగా నియమించబడిన ఆర్. ఇలంగో ఐ.పి.ఎస్. మొబైల్ న. 9497997900 జైపూర్ లోని ఎస్.టి.పి.పి. అతిథి గృహంలో ఉంటారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలు, పోటీ చేయు అభ్యర్థులు చేసే ప్రచారంలో భాగంగా చేయనున్న ఖర్చులను ఎన్నికల ఖర్చుల పరిశీలకులు, ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, శాంతి భద్రతల పర్యవేక్షణ, అనుమతులు, ఇతరత్రా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా ఐ.ఎ.ఎస్. మొబైల్ నం.7780382020 ఎన్నికల సంబంధిత సందేహాల నివృత్తి, ఎన్నికల నిర్వహణలో సమస్యల పరిష్కారం కొరకు ఉదయం 10 గం॥ల నుండి 11 గం॥ల వరకు నస్పూర్లోని సింగరేణి అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని, జిల్లా పోలీసు పరిశీలకులు ఆర్. ఇలంగో ఐ.పి.ఎస్. మొబైల్ నం. 9497997900 శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థ సంబంధిత సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారం కొరకు జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని ఎస్.టి.పి.పి. అతిథి గృహంలో సాయంత్రం 4 గం||ల నుండి 5 గం||ల వరకు అందుబాటులో ఉంటారని, రాజకీయ పార్టీలు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.