Monday, August 17, 2026
HomeTelanganaస్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉక్కుమనిషి, దేశ ప్రజలంతా ఒక్కటేనని, మనం భారతీయులమనే భావన తీసుకువచ్చి ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపిన మహామనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రీయ విద్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు తలపెట్టిన 2కె రన్ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పలేట్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్య్రం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను విలీనం చేశారని, అదే సమయంలో నిజాం సర్కార్ పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంను ఎదురించి దేశంలో విలీనం చేశారని తెలిపారు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా విశిష్ఠ సేవలు అందించారని, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఐకమత్యం అనే నినాదంతో కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా దేశంలోని ప్రజలందరినీ ఏకం చేసి దేశ సమైఖ్యతను ప్రపంచానికి చాటారని తెలిపారు. అనంతరం జిల్లాలోని నస్పూర్ లొనీ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్.సి. కార్పొరేషన్ డి.డి. దుర్గాప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ముఖ్య ప్రణాళిక అధికారి జి. సత్యంలతో కలిసి దేశ సమగ్రత, సమైఖ్యత, అంతర్గత భద్రతను కాపాడతామని, దేశాభివృద్ధికి కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.