
ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: అల్లిపూర్ గ్రామానికి చెందిన రావుల మల్లయ్య సింగరేణిలో ఈ మధ్యనే పదవి విరమణ పొందారు. అనంతరం వచ్చిన నగదు, ఇంట్లో ఉన్న బంగారం దుండగులు అపహరించారు. బాధితులు సుల్తానాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై ప్రత్యేక బృందంతో నిందితులను పట్టుకున్నారు. నగదు, బంగారాన్ని మల్లయ్య కుటుంబానికి సీపీ అందజేశారు. దీంతో బుధవారం బాధితులు, ఆ గ్రామ ప్రజలు సీపీ రేమా రాజేశ్వరి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు..
