Tuesday, August 18, 2026
HomeTelanganaహెచ్ఎం ను సస్పెండ్ చేయాలి.?

హెచ్ఎం ను సస్పెండ్ చేయాలి.?

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు రాని సమయంలో మధ్యాహ్నం భోజనం వడ్డించే వారితో బోధించడం విచారకరం అన్నారు. బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గోపాల్, జాగిరి రాజేష్, పురేళ్ళ నితీష్, పవన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.