Monday, August 17, 2026
HomeTelanganaమహరాష్ట్ర సరిహద్దులోని సిరోంచలో భూకంపం

మహరాష్ట్ర సరిహద్దులోని సిరోంచలో భూకంపం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్,  తెలంగాణ:  మహరాష్ట్ర సరిహద్దులో భూకంపం వచ్చింది. తెలంగాణ సరిహద్దుకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి 12: 41:35 గంటలకు భూకంపం సంభవించింది. గడ్చిరోలి జిల్లాకు దక్షిణ ప్రాంతమైన సిరోంచ తాలూక కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఉమనూర్-జింగనూర్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్టు, రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నమోదైంది. అయితే అర్ధరాత్రి ఒక్క సారిగా భూమి కదిలినట్టు అయిందని సిరోంచ పట్టణంలోని ప్రజలు తెలుపుతున్నారు. ఈ భూకంపం ప్రభావం సరిహద్దులోని తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మహదేవపూర్ ప్రాంతాల్లో కూడ ఉండి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ భూకంపం వలన తమకు ఏలాంటి నష్టం వాటిల్లలేదని సిరోంచ డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ అమీన్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.