Monday, August 17, 2026
HomeWorldవరదల్లో కొట్టుకు వచ్చిన పులి.. వీడియో వైరల్

వరదల్లో కొట్టుకు వచ్చిన పులి.. వీడియో వైరల్

📰 Generate e-Paper Clip

బ్యారేజ్ గేట్ల వద్ద బ్రతుకు పోరాటం

ఆంజనేయులు న్యూస్: దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్య ప్రాణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్​ఖేరీ ప్రాంతంలో ఓ పులి బ్యారేజ్‌నీటిలో తన ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే, కర్తానియాఘాట్​ టైగర్​ రిజర్వ్​ దగ్గర వరద ధాటికి ఓ పులి కొట్టుకుపోయింది. గిరిజపురి బ్యారేజీ వద్ద ఘగ్రా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల పులి వరదలో చిక్కుకుపోయి బ్యారేజ్‌ గేట్ల వరకు కొట్టుకొచ్చింది.

ఈ క్రమంలో బ్యారేజ్‌ గేట్ల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. మీదకు ఎక్కే ప్రయత్నం చేసిన వరద ధాటికి నీటిలో మునిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానికుల సాయంతో పులిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.