Monday, August 17, 2026
HomeTelanganaఆదివాసులను విడుదల చేయాలని రాస్తారోకా..!

ఆదివాసులను విడుదల చేయాలని రాస్తారోకా..!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలంలో కోయపోషగూడెం పోడు భూముల పోరాటం ఉగ్రరూపం దాలుస్తుంది. పోడు పోరులో భాగంగా శుక్రవారం ఫారెస్ట్ & పోలీస్ భారీ బలగాలకు ఆదివాసీ మహిళలకు పెద్దఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. మళ్ళీ ఐదుగురు మహిళలను ఇడ్చుకుంటూ జీపుల్లో వేసుకొని వెల్లి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో తాళ్లపెట్ రేంజ్ కార్యాలయం ముందు ప్రధాన జాతీయ రహదారి పై ఆదివాసీ నాయకులు కూర్చొని రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు మాడవి వెంకటేష్ మాట్లాడుతూ… అరెస్టు అయిన గిరిజన మహిళలను బేషరుగా వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పై కెసిఆర్ పై మండిపడ్డారు. ఈ కార్యక్రమం పార్థాన్ ప్రోహిత్ సేవాసంగ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఆడాయి కాంతారావు, మాజీ సర్పంచ్ లింగారావు, కనక జంగు కుడిమేత లక్ష్మణ్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.