Monday, August 17, 2026
HomeTelanganaటిఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరిక..!

టిఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరిక..!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. లయన్స్ భవన్ లో జరిగిన సమావేశంలో వార్డు కౌన్సిలర్ మోతె సుజాత ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరిన 50 మందికి ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలిపారు. ఎల్లవేళలా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు సుద్ధమల్ల హరికృష్ణ, గాదే సత్యం, మాజీ కౌన్సిలర్ పడాల రామన, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర, టిఆర్ఎస్ నాయకులు సోహైల్ ఖాన్, పడాల రవి, జగన్, తాజ్ బాబా, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.