Wednesday, August 19, 2026
HomeTelanganaమంచిర్యాల జిల్లా జ్యుడీషియల్ కోర్టు ప్రారంభం..?

మంచిర్యాల జిల్లా జ్యుడీషియల్ కోర్టు ప్రారంభం..?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టులో భాగంగా మంచిర్యాల జిల్లా జ్యుడీషియల్ కోర్టును గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్య మంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. బి. సత్తయ్య బాధ్యతలు స్వీకరించి న్యాయ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ జిల్లా కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయసేవలు అందుబాటులోకి వచ్చి, తక్షణ న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్య క్రమంలో మొదటి అదనపు న్యాయమూర్తి మైత్రేయి, సీనియర్ న్యాయమూర్తి ఉదయ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.