Tuesday, August 18, 2026
HomeTelanganaహాస్టల్లో బీర్లు బిర్యానీలు.. వైరల్ గా సెల్ఫీలు..?

హాస్టల్లో బీర్లు బిర్యానీలు.. వైరల్ గా సెల్ఫీలు..?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, బిర్యానీలతో విందు చేసుకున్నారు. అంతే కాకుండా బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీలు దిగడంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఘటనపై జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ప్రముఖ వెబ్సైట్ ప్రకారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సాప్ తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్ మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్ను సందర్శించి వార్డెన్ మల్లేశ్తో పాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.