Friday, August 21, 2026
Homeజాతీయoకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోరటి వెంకన్న..

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోరటి వెంకన్న..

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: ఎన్నో గొప్ప పల్లె పాటలతో సంచలనం సృష్టించిన కవి, రచయిత, తెరాస ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఇవాళ దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ అవార్డును గోరటి వెంకన్న అందుకున్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గానూ 2020-21 ఏడాదికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ ఈ పురస్కారం ప్రకటించింది. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో 1963లో జన్మించిన గోరటి వెంకన్న.. ‘వల్లంకి తాళం’తో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.