Thursday, July 2, 2026
HomeTelanganaఅసాంఘిక శక్తుల కు ఆశ్రయం కల్పించవద్దు: ఎస్పీ సురేశ్ కుమార్ 

అసాంఘిక శక్తుల కు ఆశ్రయం కల్పించవద్దు: ఎస్పీ సురేశ్ కుమార్ 

ఆసిఫాబాద్ జిల్లా: ” తిర్యాని మండలం, గుండాల గ్రామంలో శనివారం పోలిస్ లు మీకోసం”  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అథితి గా  జిల్లా ఎస్.పి కె.సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో భాగంగా  గ్రామస్తులకు నిత్యవసర సరుకులు, వృద్దులకు   వాకర్స్, పాఠశాల విద్యార్థులకు  నోట్ బుక్స్, ప్యాడ్స్,  గ్రామ యువతకు వాలీబాల్ కిట్లు   పంపిణి చేసారు. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రజల్లో పోలీసులకు స్నేహపూరిత వాతావరణం నెలకొందని , ప్రజలకు పోలిస్ వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు .అసాంఘిక శక్తుల కు , కొత్త వ్యకులకు ఆశ్రయం కల్పించకూడదని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజల ధనమానప్రాణలను రక్షించటం లో పోలీసులు ముందుంటారని గ్రామ ప్రజలకు తెలియజేసారు. ప్రజలకు ఎపుడూ ఏ సమస్య ఉన్న డయల్ 100 క కాల్ చేసి తెలియజేయాలి అని, లేని పరిస్థితులలో  పోలిస్ స్టేషన్ లో సంప్రదించాలని అన్నారు. సహజ విస్తరాకుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. దీని ద్వారా గిరిజన మహిళలు ఉపాధి పొందటం సంతోషకమన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి సాముహిక భోజనాలు చేశారు.

Post Midle

ఈ కార్యక్రమం లో  జిల్లా అదనపు ఎస్.పి  అచ్చేశ్వర్  రావు, డి.ఎస్.పి ఆర్.శ్రీనివాస్, సి.ఐ నరేందర్, ఎస్.ఐ  రమేష్ , ఆర్.ఎస్.ఐ ఓదెలు,  గ్రామ సర్పంచ్ జంగుబాయీ, ఎమ్.పి.టి.సి మెంగు బాయి  , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.