Friday, July 3, 2026
HomeCrimeమండల స్థాయిలో ఉపాధ్యాయులకు కవితా రచన పోటీలు

మండల స్థాయిలో ఉపాధ్యాయులకు కవితా రచన పోటీలు

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా: స్వతంత్ర భారత వత్రోత్సవాలను పురస్కరించుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలోని జెడ్పీ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులకు మండల స్థాయి కవితా రచన పోటీలు నిర్వహించారు. భారతదేశం- కీర్తి విశిష్టత అనే అంశంపై జరిగిన ఈ పోటీల్లో మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, మందమర్రి మండలంలో పనిచేసే ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మండలానికి రెండు ఉత్తమ కవితలను ఎంపిక చేసినట్లు ఎంఈఓ జాడి పోచయ్య, జిల్లా విద్యాశాఖ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్, ప్రముఖ కవి గుండేటి యోగేశ్వర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం ఎ. వేణుగోపాల్, మండల విద్యా వనరుల కేంద్రం సీఆర్పి సరిత, నాగేందర్ బాబు, స్వామి, శ్యామ్ పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.