తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన సలహాదారుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమేశ్ కుమార్ ఈ పదవిలో 3ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే, సోమేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన ఏపీకి బదిలీ అయ్యారు. ఏపీలో జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు

