
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు (ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.. అనంతరం ఈ వేడుకల్లో వివిధ శాఖల ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు సేవా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎంపికైన మంచిర్యాల సిఐ ప్రమోద్ రావుకు సేవా పురస్కారాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్, మరియు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

