Friday, July 3, 2026
HomeTelanganaవిద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేసిన డీఈఓ

విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేసిన డీఈఓ

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గత సంవత్సరం ఆన్ లైన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్, జవహర్ లాల్ నెహ్రూ సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు గురువారం మంచిర్యాల డిఇఓ వెంకటేశ్వర్లు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా విజ్ఞాన గనిగా ఎన్నో నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారుతోందన్నారు. నవంబర్ లో జరిగే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు విద్యార్థులు సన్నద్ధమై జాతీయ స్థాయిలో రాణించేలా ప్రదర్శనలు తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, జిజ్ఞాస బృందం శ్యామ్, సంపత్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.