Friday, July 3, 2026
HomeTelanganaప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాన్ని సింగరేణి ఆదుకోవాలి.

ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాన్ని సింగరేణి ఆదుకోవాలి.

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ SRP 3 మైన్ ను సందర్శించి గేట్ మీటింగ్ లో పాల్గొన్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి గారు హాజరై మాట్లాడుతూ…SRP 3మైన్ లో స్థానిక సమస్యలు పరిష్కరించాలి. అదే విదంగా ఈ మైన్ లో కృష్ణారెడ్డి అనే కార్మికుడు మైన్ లో పనిచేస్తూ 10-11-2021 రోజున ఫ్యాటల్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు నలుగురిలో ఇతను కూడా చనిపోయాడు.అతని కుమారుడైన శ్రీనివాసరెడ్డికి తండ్రి చనిపోయేనాటికి 35 సంవత్సరాల 2 నెలలు వయసు ఉన్నది.రెండు నెలలు ఎక్కువగా ఉన్న కారణం చేత ఉద్యోగం రాదని సింగరేణి అధికారులు చెబుతున్నారు.ఉద్యోగం ఇవ్వకపోతే అతని యొక్క కుటుంబం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.ఫ్యాటల్ ఆక్సిడెంట్ చనిపోయిన వారికి ఈ చిన్న విషయాన్ని చూపి ఉద్యోగం ఇవ్వకపోవడం వలన చాలా అన్యాయం జరుగుతున్నది.కావున దయచేసి కృష్ణరెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి ఉద్యోగం అవకాశం కల్పించి, అతని కుటుంబాన్ని ఆడుకోవాలని లేకపోతె రాబోయే రోజుల్లో SRP 3 లో ఆందోళన కార్యక్రమలకు పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్,సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ మేనేజర్ మీడివెల్లి శంకర్, శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి గోదారి భాగ్యరాజు, ఆర్గనైజేషన్ సెక్రటరీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.