ఆయ్యా ఇరు రెండు రాష్ట్రాల సీఎం సార్లు
మా డ్యూటీలు ఇక్కడ.. మా కుటుంబాలు అక్కడ..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న హోం గార్డులను సొంత రాష్ట్రాలకు బదిలీలు చేయండి..
రెండు రాష్ట్రాల డీజీపీలకు విన్నపాలు..
ఇరు రెండు రాష్ట్రాల గవర్నమెంట్లకు హోంగార్డుల కన్నీటి గాథలు విన్నండి..

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకు ఆంధ్రా స్థానికత గల హోంగార్డుల ఆంధ్ర బదిలీకి సమ ఆలోచనలు చేసి ఎక్కడి రాష్ట్ర వారిని అక్కడికి బదిలీలు చేయాలని ఇటు తెలంగాణ, అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు హోంగార్డులు వేడుకుంటున్నారు. డ్యూటీలు ఇక్కడ, ఫ్యామిలీలు అక్కడ ఉండడంతో హోం గార్డులు డ్యూటీలు చేస్తూ సతమతమవుతున్నారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెంది తెలంగాణాలో పనిచేస్తున్న హోం గార్డులను సొంత రాష్ట్రానికి బదిలీ చేసేలా ఏపీ అదేవిధంగా, ఏపీలో డ్యూటీలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర హోంగార్డులను తెలంగాణకు పంపియాలని ఇరు రెండు రాష్ట్రాల గవర్నమెంట్లను హోం గార్డులు వేడుకుంటున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోం గార్డు ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యామని, రాష్ట్ర విభజన జూన్, 2014 జరిగిన తరువాత మేము తెలంగాణలో ఉండిపోవలసి వచ్చిందని హోంగార్డులు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగిందని, కాని హోంగార్డులను మార్చలేదని, హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు. మా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దీని వల్లన మేము ఉద్యోగం చేయాలంటే కన్నీటి గాథలు వినిపిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 200 మంది హోంగార్డులు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రలో కూడా దాదాపు 200 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. డ్యూటీలు అక్కడ కుటుంబాలు ఇక్కడ ఉండటం వలన, మానసికంగా, కుటంబపరంగా, డ్యూటీకి రవాటానికి రవాణా పరంగా, ఆర్థికంగా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము. మా తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, మేము వారిని చూసుకోలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మేము తెలంగాణలో ఉంటున్నాము. మాలో కొంతమంది పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్థానికతను కోల్పోవాల్సిన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మేము వేడుకుంటున్నాం అని ఆంధ్ర స్థానిక కలిగిన హోంగార్డ్స్ సంఘం కూడా ఇటీవల ప్రభుత్వానికి విన్నపాన్ని మీడియా, పత్రికల ద్వారా తెలియజేయడం కూడా జరిగింది .
ఇంత సున్నితమైన అంశాన్ని కొన్ని తరాలుగానున్న స్థానికతను కోల్పోయే అంతటి పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొని రావడం సరైనది కాదని మేధావులు ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్న తరుణంలో ఇటువంటి స్వల్ప విషయాలపై ప్రభుత్వాలు తీరు విస్మయాన్ని కలిగిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్న తరుణంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి అల్పాదాయ ఉద్యోగులుగా శాశ్వత సేవలు అందిస్తున్న హోంగార్డ్స్ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో న్యాయం చేయవలసిన ఆవశ్యకత లేకపోలేదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. కావున ఇప్పటికైనా ఆశిద్దాం ఇరు రెండు ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే ఈ సున్నితమైన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తుందని మేమందరం వేడుకుంటున్నాం..
