Tuesday, August 18, 2026
HomeTelanganaవుమెన్ అచీవర్స్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

వుమెన్ అచీవర్స్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వంచే వుమెన్ అచీవర్స్- 2024 అవార్డు అందుకున్న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిసి- 3 అంగన్ వాడీ టీచర్ ఎన్. పద్మను శుక్రవారం యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్లి అంజయ్య యాదవ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్ కేంద్రం ద్వారా ఉత్తమ సేవలు అందిస్తున్న టీచర్ పద్మకు ప్రభుత్వ పురస్కారం రావడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి పట్టణ అధ్యక్షుడు పర్శ రాజన్న యాదవ్, నాయకులు బూస మహేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.